రథం పైభాగంలోని తిరువళ్ళువర్ విగ్రహం |
రథం |
రథం: వళ్ళువర్ కోట్టంలో రథం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రసిద్ధి చెందిన తిరువారూరు ఆలయం రథం పోలికతోనే దీనిని నిర్మించారు. 128 అడుగులు (39 మీటర్లు) ఎతైన ఈ రథం ఎదుట నల్ల రాతితో చేసిన ఏడు అడుగుల ఎత్తు కలిగిన రెండు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. ఈ రథం చక్రాలు ఒక్కొక్కటి 11 .25 అడుగులు ఎత్తు ఉన్నాయి. ఇదే రథం పై భాగంలో 30 అడుగుల ఎత్తులో తిరువళ్ళువర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఉన్న రథం భాగం మాత్రమే 40 అడుగుల వైశాల్యం కలిగి ఉంది. రథం పక్కనే నిర్మించిన ఆడిటోరియం పై భాగానికి చేరుకుంటే దాని పైనే ఈ తిరువళ్ళువర్ విగ్రహం నిర్మించినట్టు భ్రమ కలుగుతుంది. ఆ విధంగా ఆడిటోరియం, రథాన్ని పక్క పక్కనే నిర్మించారు. రథం కింది భాగంలో తిరుక్కురళ్ పద్యాల భావాలను వివరించే విగ్రహాలు ఉన్నాయి.
ఆడిటోరియం
ఆడిటోరియం ముందు భాగం |
ఆడిటోరియం పై నుంచి రథం పై భాగం |
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి