మెరీనా బీచ్

తమిళనాడులోని చెన్నైలో ఉన్న మెరీన బీచ్  ఉత్తరంలో ఉన్న సెయింట్ జార్జ్ ఫోర్ట్ సమీప ప్రాంతం నుండి దక్షిణంలోని ట్నాయో గార్ వరకు 13 కిలోమీటర్లు మేరకు విస్తరించింది. ఇది బంగాళాఖాతం తీర ప్రాంతం. ఇది ప్రపంచంలోని రెండో అతి పొడవైన బీచ్ గా ప్రచారంలో ఉన్నా అది అధికారిక ప్రకటన మాత్రం కాదు.

చరిత్ర

1881 వ సంవత్సరం ఓడరేవు నిర్మించే వరకు చాలా కాలంపాటు ఈ బీచ్ ప్రస్తుత రహదారికి చాలా సమీపంగా విస్తరించి ఉండేది. 1881 నుండి 1886 వరకు మద్రాస్ గవర్నర్‌గా వ్యవహరించిన మౌంట్‌ స్టార్ట్ ఎల్ఫిన్‌స్టోన్ గ్రాంట్ డఫ్ ఈ బీచ్ వెంబడి విహార ప్రదేశాన్ని నిర్మించడంతో పాటు దానికి మద్రాస్ మెరీనా అని పేరు పెట్టాడు. 


ప్రస్తుతం 


మెరీనా బీచ్ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. చెన్నైకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఈ బీచ్‌ను సందర్శిస్తారు. ఇక్కడ స్మారకాలు, విగ్రహాలు, ఉదయం పూట వాహ్యాలీ, జాగర్ల ట్రాక్, పచ్చిక స్థలాలు వంటివి ఏర్పాటు చెయ్యడంతో ఈ బీచ్  అన్ని వయస్సుల వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తుంది. ఈ బీచ్ లో స్నానం చేయటం / ఈత కొట్టడం నిషిద్ధం. ఇక్కడి గాంధీ విగ్రహం వెనుక ఓ స్కేటింగ్ రింక్ ఉంది. కార్మిక విగ్రహం నుంచి లైట్ హౌస్ వరకు 2.8 కిలో మీటర్ల దూరం మేరకు  కూర్చోడానికి వీలుగా 14 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అన్నా స్క్వేర్ నుండి లైట్ హౌస్ వరకు 3-కిమీ పొడవున ఆటంకం లేని కాలిబాట ఉంది. తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన "చెన్నై ఫర్ ఎవర్"లో భాగంగా 2005 సెప్టెంబరులో 1.5 మిలియన్ రూపాయలతో 34 అడుగుల ఎత్తైన, కృత్రిమ జలపాతం మెరీనాలో ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ అన్నా స్విమ్మింగ్ పూల్, మెరీనా స్విమ్మింగ్ పూల్, అక్వేరియం, మెరీనా క్రికెట్ గ్రౌండ్, డాక్టర్ అనిబెసెంట్ పార్క్ ఉన్నాయి. 



స్మారకాలు, కట్టడాలు


అన్నాదురై సమాధి 
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎమ్జీఆర్ గా  ప్రసిద్ధమైన ఎమ్జీ రామచంద్రన్ సమాధులు ఈ బీచ్ లోనే ఉన్నాయి. వీటిని సుందర నిర్మాణాలుగా తీర్చి దిద్ధటంతో  నిత్యం బీచ్ కు వచ్చే వేలాది మంది వీటిని సందర్శిస్తున్నారు.
ఎమ్జీఆర్ సమాధి
దీంతో నిత్యం సందర్శకులతో ఇవి రద్దీగా కనిపిస్తాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన జవానుల నివాళుల నిర్మించిన విక్టోరియా వార్ మెమోరియల్ కూడా ఈ బీచ్ వద్దే ఉంది. భారత దేశంలోని ప్రాచీన 

మద్రాసు విశ్వవిద్యాలయం 
విశ్వవిద్యాలయాల్లో ఒకటైన మద్రాసు విశ్వవిద్యాలయం, దేశంలోని ప్రాచీన కళాశాలల్లో ఒకటైన ప్రెసిడెన్సీ కళాశాల కూడా ఈ బీచ్ పక్కనే ఉన్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయాన్ని 

1851 వ సంవత్సరం ప్రారంభించారు. అలాగే వివేకానంద స్వామి చికాగో పర్యటనకు ముందుగా చెన్నైలో బస చేసిన ఐస్ హౌస్ భవంతి ఇక్కడే ఉంది. ప్రస్తుతం దీనిని వివేకానంద హౌస్

చారిత్రిక నాయిక కన్నగి
గా పిలుస్తుండగా ఇక్కడ వివేకానంద జీవిత చరిత్రకు సంభందించిన పుస్తక, వస్తు ప్రదర్శన కూడా శాస్వతంగా ఏర్పాటు చేశారు. ఇదే బీచ్ వెంబడి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయమైన డీజీపీ కార్యాలయం ఉంది. బీచ్ పొడువునా ఉన్న కామరాజర్ రోడ్డు వెంబడి తమిళ సాహితీ, రాజకీయ, కళా రంగానికి చెందిన ప్రముఖుల విగ్రహాలు కూడా చూడొచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి